సిరా న్యూస్, ఎల్లారెడ్డిపేట:
ఉదారత చాటిన సర్పంచ్ నేపూరి వెంకట్ రెడ్డి
– యువతి వివాహానికి పుస్తే, మట్టెలు అందజేత
– కృతజ్ఞతలు తెలిపిన కుటుంబీకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి గ్రామానికి చెందిన ఆశయ్య, రాజమణి దంపతుల ద్వితీయ పుత్రిక ప్రత్యూష వివాహానికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేపూరి వెంకట్ రెడ్డి పుస్తే, మట్టెలు అందించి, తన ఉదారత చాటుకున్నారు. నిరుపేద కుటుంబంలో పెళ్లి అని తెలియడంతో తన వంతుగా సహాయం అందించారు. కాగా అక్కపెల్లి గ్రామ ఉప సర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి, నేపూరి వెంకట్ రెడ్డి తరపున ప్రత్యూష కుటుంబ సభ్యులకు ఈ మేరకు మట్టెలు, పుస్తే అందించారు. కాగా తమకు ఆర్థిక సహాయం అందించినందుకు వారు సర్పంచ్ నేపూరి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.