బేల, సిరా న్యూస్
గోండి ధర్మగురు హీరాసుఖ జయంతి వేడుకలకు తరలి రావాలని జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు దుర్వ నగేష్, మండల పర్దాన్ సంఘం అధ్యక్షుడు నైతాం సీాతారామ్ కోరారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ఈనెల 26న ఇంద్రవెల్లి మండలంలో గోండి ధర్మగురు హీరా సుఖ జయంతిని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వెనకబడి పోయిన మనం ఎదగడానికి కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పూసం ఆనంద్ రావ్, కోశాధికారి యాదవ్ ముఖ్య సలహాదారులు గేడం మాధవ్, పుసాం రితేష్, గెడాం రమేష్,సచిన్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.