సిరా న్యూస్;
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి గాయత్రి భార్గవి మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో నటించడం మాకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నవరసాలు ఉన్న సినిమా ఇది. ఆ గ్రామీణ వాతావరణంలో షూటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాం. ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చిన దర్శకుడు దుశ్యంత్, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో సుహాస్, శివాని, శరణ్య ఈ ముగ్గురు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” థియేటర్స్ లో చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు
ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఈ మూడేళ్లలో ఆత్మీయుల్లా మారిపోయాం. సినిమాలో ప్రతి ఒక్కరూ ఎంత బాగా పర్ ఫార్మ్ చేశారంటే ఎడిటింగ్ లో ఒక్క సీన్ తీసేయడానికి కూడా మనసు రాలేదు. ఫిబ్రవరి 2న ఆడియెన్స్ కు ఒక సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతున్నాం. తప్పకుండా థియేటర్స్ కు రండి. అన్నారు.
లిరిసిస్ట్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్ లో ఇప్పటిదాకా అల వైకుంఠపురములో, వినరో భాగ్యము విష్ణు కథ, బేబి సినిమాలకు పాటలు రాశాను. ఇప్పుడు “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు లిరిక్స్ ఇచ్చాను. వాటిలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో సాహిత్యానికి విలువ ఉండే పాటలు రాసే అవకాశాన్ని నాకు అందించారు దర్శకుడు దుశ్యంత్. మంచి మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి కంగ్రాట్స్. ఈ సినిమా సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు అద్దం పట్టేలా ఉంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ – తెలుగు సినిమా రంగం గొప్ప టెక్నీషియన్స్ ను చూసింది. పాతాళభైరవి, శంకరాభరణం లాంటి గొప్ప సినిమాలను మన దర్శకులు తెరకెక్కించారు. కొంతకాలం తర్వాత తెలుగు సినిమా అంత గొప్ప సినిమాలు తెరకెక్కించలేకపోయిందనే అపవాదు తెచ్చుకుంది. మిగతా పరిశ్రమల్లోనూ కొత్త నీరు వస్తోంది. న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమను కంటెంట్ ఓరియెంటెడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఎస్ కేఎన్, సాయి రాజేశ్, బన్నీ వాసు, ధీరజ్ అలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. బేబి లాంటి మూవీని కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ గా తీసి వారు సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కూడా అలాంటి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.