అసెంబ్లీలో కనిపించిన వెంటనే వైఎస్ జగన్ని పలకరించిన ఆర్ఆర్ఆర్
సిరా న్యూస్,విజయవాడ;
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు సోమవారం అసెంబ్లీలో వైఎస్ జగన్ కు ఎదురుపడ్డారు. వెంటనే హాయ్ జగన్ అంటూ పలకరించారు. ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని జగన్ బదులిచ్చారు. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై చేయి వేసి కాసేపు రఘురామ కృష్ణం రాజుమాట్లాడారు.
తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ను రఘురామ కోరారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో కేశవ్నవ్వుకుంటూ వెళ్లారు. ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రఘురామను పలకరించారు.