ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో నిలిచిన లాంచీ
సిరా న్యూస్,విజయవాడ;
ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నదిలో ఒక లాంచీ ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో నిలిచిపోయింది. 25మంది ప్రయాణికులు తో రాయపూడి నుండి బయలు దేరిన లాంచీ, లాంచీ ఇసుక దిబ్బలు తాకడం తో ఆగిపోయింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు స్థానిక మత్యకారుల సహకారం తో యుద్ద ప్రాతిపదికన పడవలతో ప్రయాణికులను తరలించే ప్రక్రియ ప్రారంభించారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడం తో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. లాంచీ ఇసుక దిబ్బలు డీ కొట్టిన ఘటన లో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయింది..