బద్వేలు,సిరా న్యూస్;
ప్రతిభా పుస్కారాల ప్రదానం లో ప్రముఖులు.
విద్య ద్వారానే ఉన్నతస్థానాలు చేరుకునే అవకాశం ఉందని, కష్టపడి ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు , గురువులకు సమాజానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బడిగించల జయలక్ష్మి, శ్రీమత్ అహోబిల తొగటవీర క్షత్రియ అన్నదాన సత్రం అధ్యక్షులు పల్లా శేషయ్య, సెంట్రల్ జిఎస్టి కడప సూపరింటెండెoట్ గొరిగే శివ శంకర్ లు విద్యార్థులకు పిలుపునిచ్చారు. జమ్మల మడుగు తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారు ఈరోజు ప్రతిభా పురస్కారాల క్రింద నగదు,జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలుఅందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మక శక్తిని వెలికి తీయడంలో ఇలాంటి ప్రతిభ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్య ద్వారానే అసమానతలు కూడా రూపుమాపవచ్చు అని తెలిపారు. కష్టపడి చదివితేనే కోరుకున్న స్థానాలను చేరుకోవచ్చు అన్నారు. పేద విద్యార్థులకు విద్య ఒక వరమని, ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణ ,అంకితభావం, పట్టుదలతో చదివి సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఇతరులకు చేయూత అందిస్తే మరింతగా రాణించే అవకాశం ఉందన్నారు. విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న జమ్మలమడుగు తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.కాగా ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వేరువేరుగా ప్రధమ ,ద్వితీయ , తృతీయ బహుమతుల కింద రు5116, రు3116, రు2116లతోపాటు,ప్రోత్సాహక బహుమతు ల క్రింద 21మందికి రు 1116 లు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు బండారు సూర్యనారాయణ ,బందా శంకర్, కోశాధికారి కుండా భాస్కర్ ,కడప నగర శాఖ అధ్యక్షులు కళ్యా సుధాకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా నరసింహారావు , ప్రధాన కార్యదర్శి సుంకర రామచంద్రుడు, జమ్మలమడుగు తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు కవలా రామయ్య, ప్రధాన కార్యదర్శి చౌడం పుణ్యమూర్తి, కోశాధికారి వంకం పద్మనాభం, కళ్యాణమండపం, దేవస్థానo అధ్యక్షులు గంజికుంట తిరుమల దాసు, ప్రొద్దుటూరు తొగట వీర క్షత్రియ కళ్యాణమండపం అధ్యక్షులు బండారు రఘురామయ్య, మో రగుడి సర్పంచ్ చౌడం జొల్లు కొండయ్య ,వంకం లక్ష్మీనారాయణ ,ముప్పూరి సుబ్బయ్య, వంకం మురళి, మద్దకం ధనుంజయ, ఉమ్మడిశెట్టి వెంకటేష్, తిప్పాబత్తిన గోపాల్ దాస్, బడిగింజల రామకృష్ణ, కాటా రామదాస్, బడిగింజల చంద్రమౌళి, పల్లా జ్వాలావతి పెద్ద సంఖ్యలో తొగటవీర క్షత్రియ కులబాంధవులు పాల్గొన్నారు.