సిరా న్యూస్, జైనథ్:
హెచ్ఎం చిందం దేవిదాస్కు ఘన వీడ్కోలు
+ పూలమాలలు, శాలువాలతో సన్మానం
+ పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు
+ హాజరైన గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు చిందం దేవిదాస్ను ఉపాద్యాయులు, స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్గా బేల మండలం సిర్సన్నకు వెళ్లిన ఆయనకు సోమవారం పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియాడారు. హరిత హారంలో భాగంగా మొక్కలు నాటడం, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం, పాఠశాల ప్రహారీ, కిచెన్ షెడ్, టాయిలెట్లు, పాఠశాలలో నీటి సదుపాయం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టం జర్గిందని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మెన్ కవిత గన్నోజీ, నాయకులు రాజేశ్వర్, భగవాన్ రెడ్డి, కిష్ఠా రెడ్డి, జి అశోక్ రెడ్డి, మహేందర్ యాదవ్, సర్వేశ్వర్ రెడ్డి, రాజారెడ్డి, సాయి వర్మ, తదితరులు పాల్గొన్నారు.