సిరా న్యూస్ , కరీంనగర్
విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధించాలి
* చిగురుమామిడి ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి
* విద్యార్థుల రికార్డులు పరిశీలన
ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధించాలని ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి, సలీం అన్నారు. గురువారం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2023- 24 సంవత్సరపు పదో తరగతి చదువుతున్న విద్యార్థుల అసైన్మెంట్,నోట్ బుక్స్, పలు పరీక్షల రికార్డులు చిగురుమామిడి ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి, సలీం లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొలాడి లక్ష్మణరావు, ఉపాధ్యాయులు కానిగంటి రాజమౌళి, శ్యామయ్య, జ్యోత్స్న, శంకరమ్మ,శంకర్, ప్రతిమ, చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.