సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం దర్శించుకున్నారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా కూటమి ప్రభుత్వంపై ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో భక్తులలో ఆనందంగా కనపడుతుంది. గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెప్పుతున్నారని అన్నారు.