సిరా న్యూస్,విశాఖపట్నం;
పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.
హోం మంత్రి మాట్లాడుతూ మరో దురదృష్టకరమైన ఘటన. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి.
మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పాము. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందనిఅన్నారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమిటీ వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎల్జీపాలిమర్స్ ఘటన ఎంత పెద్ద సంఘటన. కనీసం అప్పటి ముఖ్యమంత్రి పరామర్శకు కూడా రాలేదని అన్నారు.