సిరా న్యూస్,విశాఖ;
గాజువాక పవన్ సాయి హస్పటల్ వద్ద చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాద క్షతగాత్రులను హోం మంత్రి పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసారు. బాధిత కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
మంత్రి మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు,స్వల్పంగా గాయపడిన క్షతగాత్రులకు 25 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 24 గంటలు గడవక ముందే అందజేసాము. చెక్కులతో బ్యాంకుల చుట్టూ తిరగకుండా, వారివారి అకౌంట్ ల్లో డబ్బులు జమ చేసాం.డబ్బులు జమచేసిన కన్ఫర్ మేషన్ అందజేసాం. ప్రమాదం జరిగిన వెంటనే సహయక చర్యల్లో పాల్గొన్నాం.క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.