పెద్దమండెంలో పరువు హత్య

సిరా న్యూస్,అన్నమయ్య;
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండల, పెద్దమండెంలో యువతి పరువు హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం, కొటాల పంచాయతి, ఎగువ బోయపల్లెకి చెందిన హరినాథ్ కుమార్తె గుగ్గిళ్ళ శ్వేత అదే గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ ను ప్రేమించింది. ఇంట్లో తెలిసి మైనర్ కు పెళ్లి చేయకూడదని మేజర్ అయ్యాక చేస్తామని చెప్పడంతో శ్వేత మంగళవారం సాయంత్రం పెద్దమండెం మండలం, బండ్రేవు వద్ద తపసిమాను గుట్టలో పలవరేను చెట్టుకు చున్నీతో ఊరేసుకుని చనిపోవడం, తల్లి దండ్రులు మృతదేహాన్ని కొంత దూరం తీసుకెళ్లి గుట్టుగా కాల్చేయడంతో పలు అనుమానాలకు తవిస్తోంది. కొట్టి చంపేసారా.. లేక ఆత్మ హత్య చేసుకొందని పరువు కోసం గుట్టుగా కాల్చేశారా పోలీసుల విచారణలో తేలాల్చి ఉంది. ఏదేమైనా బుధవారం ఉదయం వెలుగు చూసిన సంఘటనను పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *