సిరా న్యూస్,సిద్దిపేట;
జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం లో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ,జడ్పీటీసీలు , ఎంపీపీలకు మంత్రి సన్మానం చేసారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో గడిపిన జడ్పీ చైర్మన్ , వైస్ చైర్మన్,జడ్పీటిసి ,ఎంపిపి , ఎంపిటిసి ల అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలి . ప్రజాస్వామ్యంలో పోరాటాలు ఉద్యమాలు ఎన్నికల వరకే . సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తా. ఇందిరమ్మ ఇళ్లు , నూతన రేషన్ కార్డులు అమలు చేస్తాం. రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్య, రైతాంగ, వైద్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రాష్ట్రంలో 26 వేల స్కూల్ లకి 1100 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం,