అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మంథని కళాశాల అధ్యాపకునికి ఘనంగా సత్కారం

సిరా న్యూస్,మంథని;
మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న ఆడేపు లక్ష్మీనారాయణ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేష్ లాల్ పర్యవేక్షణలో “గల్ఫ్ మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ- ద కేస్ ఆఫ్ తెలంగాణ రీజియన్” అనే అంశంపై డాక్టరేట్ పొందిన సందర్భంగా కళాశాల పక్షాన, పూర్వ విద్యార్థుల సంఘం పక్షాన శాలువా, మెమెంటో తో ఘనంగా సన్మానించారు. అలాగేకళాశాలలో గత నెల 23 న కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహంగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొండల మారుతి ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రశంసా పత్రం, శాలువాలతో సత్కరించడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపల్ ఎండి తాహిర్ హుస్సేన్ పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ చదువుతోపాటు సాంస్కృతిక అంశాలలో కూడా రాణించాలని ఆయన కోరారు.
కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొండల మారుతి మాట్లాడుతూ విద్యార్థులలో నిగూఢంగా ఉన్న కలలను ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ కృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ పరిషయ్య, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, గ్రంథ పాలకులు డాక్టర్. భరత్, అధ్యాపకులు సతీష్, అమర్నాథ్, ముకుందము, మానస, రజిత, బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, రాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *