సంక్రాంతి సందర్భంగా గుర్రపు పందేలు

సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా ఉమ్మలాడ పంచాయితీ పరిధిలో సంక్రాంతి పురస్కరించుకుని ఏటా గుర్రపు పందాలను నిర్వహించే అనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా పండుగ సందర్భంగా గుర్రపు పందాలను నిర్వహించారు. ఈ ఏడు కూడా పందాలకు అనూహ్యమైన స్పందన లభించింది. సంక్రాంతికి సొంత గ్రామాలకు చేరుకున్న వారంతా పందాలను తిలకించేందుకు ఉత్సాహం చూపడంతో సందడి వాతావరణం నెలకొంది. పోటీలలో 25 గుర్రాలు పాల్గొన్నాయి. మొదటి బహుమతి 15000,రెండవ బహుమతి 12,000, మూడవ బహుమతి 10,000, 4వ బహుమతి గా 8,000 లు నిర్వహించమన్నారు. ఇవి కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి ఖర్చుల నిమిత్తం 1500 ల రూపాయలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *