వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి సంక్షేమం

నేడు లింగనేని దొడ్డి,బొందిమడుగుల, నునుసురాళ్ల మరియు నల్లగుండ్ల గ్రామాలలో ప్రచారాన్ని కొనసాగించిన రమ్య రెడ్డి

 సిరా న్యూస్,తుగ్గలి;
వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి సంక్షేమం అందిందని పత్తికొండ నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి కోడలు రమ్యా రెడ్డి తెలియజేశారు.శనివారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల లింగనేని దొడ్డి, బొందిమడుగుల,నునుసురాళ్ల మరియు నల్లగుండ్ల గ్రామాలలో రమ్య రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా మరియు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని ఆమె తెలియజేశారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో మరోసారి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆమె ప్రజలకు వివరించారు. పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి, ఎంపీ అభ్యర్థిగా బివై రామయ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ఇంటింట ప్రచారాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జిట్టా నాగేష్,వైస్ ఎంపీపీ ఎర్ర నాగప్ప,జొన్నగిరి విద్యా కమిటీ చైర్మన్ రఘు,పగిడిరాయి జగన్నాథరెడ్డి, జడ్పిటిసి పులికొండ నాయక్,ముడియాల ఈశ్వర్ రెడ్డి,నాగిరెడ్డి, ఎంపీటీసీ సుంకన్న, నల్లగుండ్ల గోపాల్ రెడ్డి,జొన్నగిరి ఓబులేసు, పకీరప్ప,శభాష్ పురం హనుమంతు, తుగ్గలి శ్రీనివాసరెడ్డి,తుగ్గలి మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,అట్ల గోపాల్ రెడ్డి, బసిరెడ్డి, పెండేకల్ కారం భాస్కర్ రెడ్డి, నాగభూషణం రెడ్డి,ఎర్రగుడి రామచంద్రా రెడ్డి,గోపాల్ రెడ్డి, లంకాయ పల్లి హనుమంత్ రెడ్డి,కడమ కుంట్ల అమర్నాథ్ రెడ్డి తదితర మండల వైసీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *