నలుగురు మావోయిస్టులు మృతి
సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పు లు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే,అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు, మావో యిస్టులు తారస పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందు పాతరలు,ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.