కుప్పంలో ఎన్నికల వేల భారీ మద్యం పట్టివేత

సిరా న్యూస్,కుప్పం;
చిత్తూరు జిల్లా,కుప్పం నియోజకవర్గంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లికి తరలిస్తున్న భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబపెట్టేందుకు ఈ మధ్యం తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6లక్షల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు ముద్దాయిలను ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్నమని ఎస్ఈబీ పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సారా తయారు చేస్తుంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *