సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ లోని ప్రతిష్టాత్మక ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరను పురస్కరించుకొని దేవాలయ ఆవరణలో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ జాతర విజయవంతం కోసం, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. జూలై 21న జాతర, 22న రంగం భవిష్యవాణి, అంబారీ ఊరేగింపు ఉంటుందని దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలను, భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు..
======