సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ లో భార్య మధు స్మిత(28)ను చంపి భర్త ప్రదీప్ పరారయ్యాడు. మధు స్మితను హత్య చేసి బ్యాగ్ లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.ప్రదీప్ స్థానికంగా హోటల్ లో పనిచేస్తూ ఆరునెలలుగా న్యూ భారత్నగర్ లో నివాసం ఉంటూన్నారు. దాదాపు మూడు రోజుల క్రితం హత్య చెసి బ్యాగులో పెట్టి పరారైనట్లు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దంపతులు ఇద్దరూ ఒడిస్సా ప్రాంతానికి చెందిన వారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు…
======