Hussain: జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి:  సివిల్ జడ్జి బి హుస్సేన్

సిరాన్యూస్‌, బోథ్‌
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి:  సివిల్ జడ్జి బి హుస్సేన్

జూన్ 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాల‌ని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మున్షిప్ మేజిస్ట్రేట్ సివిల్ జడ్జి బి హుస్సేన్ అన్నారు. శ‌నివారం కోర్టు ఆవరణలో ఎక్సైజ్ స్థానిక పోలీసు అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీకి వచ్చే కేసులను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు తగు చొరవ చూపించాలని  కోరారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *