Hyena:హైనా దాడిలో దూడ మృతి

సిరాన్యూస్‌,చిగురుమామిడి
హైనా దాడిలో దూడ మృతి
* బాధిత రైతును ఆదుకోవాలి
హైనా దాడి చేసిన ఘటనలో దూడ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో చోటుచేసుకుంది. నవాబ్ పేట గ్రామానికి చెందిన మర్రి ఐలయ్య అనే రైతు పొలం వద్ద పశువుల పాకలో కట్టేసిన దూడపై మంగళవారం రాత్రి హైనా దాడి చేయగా దూడ మృతి చెందినట్లు తెలిపాడు.వివరాల్లోకి వెళితే… రోజు మాదిరిగానే పొలం వద్దనున్న పశువుల పాకలో దూడను కట్టేసి వెళ్లానని, బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పశువుల పాకలో చూడగా దూడ మృతి చెందిందని ఐలయ్య విలపించారు. సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.పాద ముద్రలు హైనవని ధ్రువీకరించినట్లు తెలిపారు.జీవనాధారం కోల్పోయిన రైతు ఐలయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *