సిరా న్యూస్,రాజోలు;
రాజోలు నియోజవర్గ జనసేన కూటమి అసెంబ్లీ అభ్యర్థి దేవా వరప్రసాద్ ఎన్నికల ప్రచార ర్యాలీలో జనసేన స్టార్ క్యాంపెనర్ హైపర్ ఆది పాల్గొని ప్రచారం చేసారు. మలికిపురం మండలం రామరాజులంకలో, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లెలో భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైపర్ ఆదికి ఘన స్వాగతం పలికారు. రామరాజులంకలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ వైసిపి పై పంచుల వర్షం కురిపించారు.. రాజోలు విద్యావంతుడు దేవర ప్రసాద్ ను గెలిపించాలనీ, పిఠాపురంలోనూ రాజోలు లోను బ్యాలెట్ మిషన్లో నాలుగో నెంబర్ వచ్చిందని ఆయన అన్నారు, కచ్చితంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. నేను వృత్తి రీత్యా కమెడిన్ నీ అనీ, రాజకీయాలలో వైసిపి నాయకులు నిజమైన కమిడియన్ల అని విమర్శించారు. దేవ వరప్రసాద్ మాట్లాడుతూ తన ప్రచారానికి వచ్చిన హైపర్ ఆదికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడతానని దేవ వరప్రసాద్ అన్నారు.
==========