వైసీపీ కి రాజీనామా చేస్తున్నా

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..
 సిరా న్యూస్,పిఠాపురం;
25 ఏళ్ళు గా పిఠాపురం ప్రజానీకం తో మమేకం అయి ఉన్నాను. నా కింద క్యాడర్ కోసమే వైసిపి కి రాజీనామా చేస్తున్నానని మీడియా ముఖంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. పిఠాపురం ప్రజలు నన్ను రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు వారికి రుణపడి ఉంటాను. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు అని జగన్ తో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు. నాకు ఎవరితో ఇబ్బంది అనేది మీకు తెలుసు అని అనుచరులు తో చర్చించి భవిష్యత్తు పై నిర్ణయం తీసుకుంటాను అని తెలిపారు.
పిఠాపురం లొనే ఉంటాను, అందరికీ అండగా నిలుస్తాను. కూటమి లో అన్ని పార్టీలు నుంచి ఆహ్వానం ఉంది. కూటమి పార్టీలో చేరుతాను, ఏ పార్టీ అనేది క్యాడర్ తో కలిసి నిర్ణయం తీసుకుంటాను. పెత్తనం చేయడానికి వెళ్లడం లేదు. జనసేన కి, పవన్ కి నా వలన ఉపయోగం ఉన్న సూచనలు చేస్తానని అన్నారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సర్పంచులు ఎంపీటీసీలు పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *