ఎర్రబెల్లి దయాకర్ రావు
సిరా న్యూస్,హైదరాబాద్;
నా మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేశారు, పిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. అతను బిజెపిలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుండీ సస్పెండ్ చేసింది. ఎన్ఆర్ఐ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేస్తుండు. విజయ్ అనే వ్యక్తీని అంతే మోసం చేశాడు, ఎన్నారై I వాళ్లు అందరు నాకు పరిచయస్తులు. చరణ్ పై చాల కేసులు ఉన్నాయి. దొంగ పత్రాలు పెట్టీ కబ్జాలు చేయటం, అనేక కేసులు అతని పై ఉన్నాయి. 40 యేండ్ల పాటు రాజకీయాల్లో ఉంటున్న, నా పై ఎటువంటి మచ్చ లేదు. వాస్తవాలు తెలుసుకొని ప్రెస్ మిత్రులు వార్తలు రాయాలనిఅన్నారు.
విజయ్ అనే వ్యక్తీ మా బంధువని వార్తలు రాస్తున్నారు, విజయ్ మాకు బంధువు కాదు. ప్రణిత్ రావు ఎవరో నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదు. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడీ, కేసులు పెట్టారు. కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాని ఎస్పీ రిజర్వర్డ్ చేశారు. ఓటు నోటుకు కేసు … నాకు ఎటువంటి సంబంధం లేదు. వార్త డైవర్ట్ అవుతోంది … ఓటుకు నోటు కేసు పై నేను స్పదించనని అన్నారు.