పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు
సిరా న్యూస్,పుతలపట్టు;
విలువ లేని పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చిత్తూరు జిల్లా, పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని, నా రాజకీయ భవిష్యత్తు ప్రారంభం కాంగ్రెస్ పార్టీలో మొదలైందని పూతలపట్టు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అన్నారు. వైసీపీ లో ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని కష్టపడి అభివృద్ధి మార్గంలో నడిపించినా కూడా అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరం అన్నారు. గతంలో డా ‘సునీల్ కుమార్ పార్టీకి ద్రోహం చేసిన వారికి ఈరోజు పక్కన కూర్చుని పెట్టి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పూతలపుట్టులో నిర్వహించిన సిద్ధం సభకు స్థానిక ఎమ్మెల్యే నాకు ఆహ్వానం రాకపోవడం నా మనసును కలిచి వేసిందని అవేదన వ్యక్తం చేసారు. వైయస్సార్ పార్టీ నన్ను వాడుకుని వదిలేసిన పార్టీ అంటూ విమర్సించారు. ప్రధానంగా కాణిపాకం ఆలయ అభివృద్ధి చేశానని, నాకు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరానని రాబోయే కాలంలో మా అధ్యక్షురాలిని షర్మిలమ్మని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయం అన్నారు.
బంగారు పాళ్యం ఈనెల 15వ తేదీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర ఉందని పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం.ఎస్.బాబు తెలిపారు.
================