దొంగ పట్టాలిస్తున్న పేర్ని నాని

మాజీమంత్రి కొల్లు రవీంద్ర.
సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నంలో ఇటీవల పేర్ని నాని ఇచ్చిన దొంగ ఇళ్ల పట్టాలపై టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. కుమారుడును అందులో మెక్కించడానికి రకరకాల నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. మచిలీపట్నం ఎమ్మార్వో ఆఫీస్ లో అర్ధరాత్రి వరకు కూర్చొని స్వయంగా పట్టాలు చేయించాడు. దొంగ పట్టాలిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. స్మశానాలకి స్ట్రీట్ ఫీల్డ్స్ అని, మడుగు పోరంబోకు స్థలాలకి పట్టాలిస్తూ.. కొడుకును అందరూ మెక్కించడానికి పట్టపగలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 15 రోజుల క్రితమే దీనిపై కలెక్టర్ వారికి ఎంక్వయిరీ చేయమని వినతిపత్రం అందజేయడం జరిగింది. చట్ట ప్రకారం చల్లని బొమ్మలకు పట్టాలిస్తూ ప్రజలను ముంచుతున్నాడు. సెంట్ర భూమిని చెప్పి దిక్కుమక్కు లేని స్థలాలను అప్పజెప్పారని అన్నారు.
3,500 జి ప్లస్ -3 ఇల్లు కడితే ఇప్పటివరకు దాన్ని ప్రజలకు అందించలేదు. తక్షణమే ప్రజలను మోసం చేస్తూ పట్టాలు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. తక్షణమే ప్రజలకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. .
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *