సిరాన్యూస్, కుందుర్పి
బాల్య వివాహాలు అరికడదాం, ఆడబిడ్డలను కాపాడుదాం
మహిళా శిశు అభివృద్ధి పథకం అధికారిని వనజ అక్కమ్మ
బాల్య వివాహాలు అరికడదాం, ఆడబిడ్డలను కాపాడుదామని మహిళా శిశు అభివృద్ధి పథకం అధికారిని వనజ అక్కమ్మ అన్నారు. సోమవారం కుందుర్పి మండలం అపిలేపల్లి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆర్.డి.టి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు అరికడదాం…ఆడబిడ్డలను కాపాడుదాం అనే కార్యక్రమం ఆర్ డి టి మహిళా విభాగం టీం లీడర్ ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంబదూరు ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని వనజ అక్కమ్మ, కుందుర్పి మండల విద్యాధికారి తిప్పేస్వామి హాజరయ్యారు. ఈసందర్బంగా కంబదూరు ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని వనజ అక్కమ్మ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం, ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని తెలుపుతూ ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు. అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన హాజరైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు తెలిపారు. రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విదింప బడుతాయఅని తెలియజేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098, 100, 112 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆర్ డి టి మహిళా విభాగం టీం లీడర్ ఆదినారాయణ మాట్లాడుతూ సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్రరూపం దాల్చిందని బాల్య వివాహాలు,బాలలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని బాలలను, వారికున్న హక్కులను ( జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు ,భాగస్వామ్యపు హక్కు ) కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ , ప్రధానోపాధ్యాయులు ధనుంజయ, ఉపాధ్యాయులు జయశ్రీ, జయరాం నాయక్, నలిని, సుగుణ, జయలక్ష్మి, వైద్య సిబ్బంది భార్గవి, అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులు పాల్గొన్నారు.