సిరాన్యూస్, ఇచ్చోడ
ఇచ్చోడలో రాంజీ గోండ్ వర్ధంతి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో మంగళవారం ఆదివాసీ హక్కుల పోరాట 9 తెగల సమితి ఆధ్వర్యంలో రాంజీ గోండ్ 164 వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయులను ధిక్కరించిన యోధుడు రాంజీ గోండని అన్నారు. నాగపూర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆయన చేసిన గొరిల్లా పోరాటాలు ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టించాయని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే స్వాతంత్ర సమరం మొదలైందన్నారు. కార్యక్రమంలో ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.