సిరాన్యూస్,ఇచ్చోడ
ఇచ్చోడలో బంద్ ప్రశాంతం
* ద్విచక్ర వాహన ర్యాలీ
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి బందుకు సంపూర్ణ సహకారం అందించారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్, వివిధ హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు మండల కేంద్రంలో గల్లి గల్లి తిరుగుతూ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఆపాలని హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్ల కార్డులు చేత బూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో ఆలయాలతో పాటు, హిందువుల ఇళ్లు దెబ్బతిన్నాయని ఆరోపించారు. మానవ హక్కులు హరించి వేస్తున్నా లౌకిక వాద శక్తులు స్పందించక పోవడం బాధాకరం అన్నారు. హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.