సిరాన్యూస్, ఇచ్చోడ
ఇచ్చోడలో ఏజెన్సీ బంద్ ప్రశాంతం
ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఏజెన్సీ బంద్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగింది. బంద్ సందర్బంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మండల కేంద్రంలో వీధుల గుండా తిరుగుతూ తెరిచి ఉన్న వాణిజ్య, వ్యాపార దుకాణాలను మూయించి వేశారు. అనంతరం రహదారిపై నిరసన తెలిపారు. ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ వేయాలని ఐటీడీఏ లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆదివాసుల హక్కులు కాపాడేందుకు జీవో నెంబర్ 3ని పకడ్బందీగా అమలు పర్చాలని డిమాండ్ చేశారు.