అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా…

కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ హామీ

 సిరా న్యూస్,మంచిర్యాల;
పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చాడు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని దండపెళ్లి లక్షట్ పేటలోఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నుండి ఎంపీగా తనని గెలిపిస్తేపెద్దపల్లి పార్లమెంటు నుండి ఎంపీగా తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వంశీకృష్ణ ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు.అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *