స్వతంత్ర అభ్యర్థి గుంటూరు
సిరా న్యూస్,పరవాడ;
పెందుర్తి స్వతంత్ర అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహమూర్తి శుక్రవారం సాయంత్రం 96 వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసని తెలిసిన వెంటనే అంచులుగా పరిష్కరిస్తానని అన్నారు.పెందుర్తిలో రాజన్న పేరుతో ఇల్లుల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో మా నాన్నగారికి మంచి పేరు ఉందని ఆ పేరు ప్రఖ్యాతలను నేను నిలబెడతానని హామీ ఇచ్చారు. నిత్యవసరదరలు అలాగే పన్నులు బారాలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో అటువంటి సమస్యలపై ప్రస్థావన తేవాలంటే నిజాయితీగా ఉన్న వ్యక్తి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్తీ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ మంచి వ్యక్తులు అసెంబ్లీకి వెళ్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అటువంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపించే బాధ్యత ప్రతి ఓటర్ పై ఉందని అలాగే ఓటును ఎవరు అమ్మకొవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వెంకట్ నరసింహ సతీమణి భారతి , అధిక సంఖ్యలో గుంటూరు అభిమానులు పాల్గొన్నారు.