వైసిపి యువ నాయకులు ప్రదీప్ రెడ్డి
సిరా న్యూస్,కౌతాళం;
మీ ఇంట్లో మంచి జరిగితే ముఖ్యమంత్రి జగన్ కు ఓటేయాలని మీ కుటుంబానికి లబ్ధి చేగురితే నాకు ఓటెయ్యండి అని అన్న ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి అని వైసిపి నాయకులు ప్రదీప్ రెడ్డి రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరపతి సంఘం బ్యాంకు ఆవరణలో వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా నాలుగో విడత జగనన్న పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వైసిపి యువ నాయకులు ప్రదీప్ రెడ్డి మండల నాయకులు ప్రహ్లాద చారి ఎంపీపీ అమరేశప్ప ,కోఆప్షన్ నెంబర్ మహబూబ్, హజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ …మహిళా సాధికారత కు అధిక ప్రాధాన్యమిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.నాడు నేడు పాలనలో వ్యత్యాసానికి పదేళ్ళ మీ బ్యాంకు స్టేట్ మెంట్లే తిరుగులేని సాక్ష్యం.వైయస్ఆర్ చేయూత తో 4518 మంది మహిళా లబ్ధిదారులకు రూ.8 కోట్ల .47 లక్షల ఆర్థిక సాయం , వైయస్ఆర్ ఆసరా పథకం ద్వారా 843 మంది అక్కాచెల్లెమ్మలకు నేరుగా వారి ఖాతాల్లోకి 3కోట్ల 27 లక్షలు జమ చేయడం జరిగిందనీ పేర్కొన్నారు..మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతతో గొప్పగా ఎదగాలనే మనస్థత్వం మన జగనన్న ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి కృష్ణంరాజు, మండల నాయకులు ప్రహ్లాద చారి, ఎంపీపీ అమరేశప్ప, కోఆప్షన్ నెంబర్ మహబూబ్, సర్పంచ్ పాల్ దినకర్ ,బుజ్జి స్వామి మాజీ ఎంపిటిసి చౌదరి బసవ,రజహమద్, లింగన్న గౌడ్, ఏపీవో రాజశేఖర్ మరియు సీసీలు పొదుపు మహిళలూ, చేయూత మహిళలు భారీగా తరలి వచ్చారు.