కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే జగన్ పై పోటికి సిద్ధం

ఎన్. ఎస్. యు. ఐ.రాష్ట్ర ఉపాద్యక్షులు , ఎఐసిసి సభ్యుడు ధృవకుమార్ రెడ్డి

 సిరా న్యూస్,బద్వేలు;
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెడ్డిపై పోటి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎఐసిసి సభ్యుడు, ఎన్ యుఎస్ యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూలం రెడ్డి ధృవకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పులివెందుల అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి పోటి చేసేందుకు దరఖాస్తును ఎఐసిసి సభ్యుడు, ఎన్ యుఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధృవకుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఆశ్వీస్సులతో పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి సహకారంతో పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోని విద్యార్థి విభాగంలో పని చేయడం జరిగిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో సిఎం జగన్ రెడ్డిపై పోటి చేసి మెజార్టీ తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో గుర్తింపు వచ్చేందుకు తనకు సహకరించిన పిసిసి మాజీ అధ్యక్షులైన సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి , కెవిపి రామచంద్రరావు, ఎన్ యుఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసేందుకు ఎపి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగిందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ విభాగంలోని విద్యార్థి యవజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై కూడ పోరాటాలు కూడ కొనసాగించినట్లు చెప్పారు. పులివెందుల సీటు తనకు కేటాయిస్తారని అశీస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *