మంథని;సిరా న్యూస్;
-బడుగు, బలహీన వర్గాల బ్రతుకులు మారాలంటే పేద బిడ్డ గోమాసే శ్రీనివాస్ ను ఎంపీ గా గెలిపించండి
-బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
-బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ప్రచారం
గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రావాలని బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.
సోమవారం మంథని మండలం గుంజపడుగు గ్రామం లో ఉపాధి హామీ కూలీలను బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్,, జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి లు, కలసి వారి సమస్య లను అడిగి తెలుసుకోన్నారు గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సునీల్ రెడ్డి మాట్లాడుతూ
ఉపాధి హామీ, రోడ్ లు గ్రామ పంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు, స్మశాన వాటికలు, పల్లె పకృతి వనాలు, అన్ని కేంద్ర ప్రభుత్వ నిదులే అని, గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే మోడీ ప్రభుత్వం మళ్ళీ రావాలన్నారు, రాష్ట్ర ప్రభుత్వం జుట హామీలతో అధికారం లోకి వచ్చిందని, 100 రోజులు దాటినా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయి లో అమలు చేయలేదన్నారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ కి ఓటు వేయాలని, బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ మాట్లాడుతూ
బడుగు, బలహీన వర్గాల బ్రతుకులు మారాలంటే, సమూచిత స్థానం దక్కలంటే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని, పేద కుటుంబ నుండి వచ్చిన నన్ను గెలిపించి, ధనవంతుల, కుటుంబ రాజకీయ లకు చరమగితం పాడాలన్నారు, బీజేపీ అధికారం లోకి రాకుండా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం మనదే అన్నారు.
ఈకార్యక్రమంలో ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు కాసిపేట శివాజీ,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బండి దేవేందర్, మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ ,జిల్లా సీనియర్ నాయకులు చిదురాళ్ల మధుకర్ రెడ్డి, నారమల్ల కృష్ణ, మండల నాయకులు రేపాక శంకర్, ఎల్కా సదానందం, బొసెల్లి మౌనిక, విష్ణువర్ధన్, తిరుపతి ,సదానందం, కొమురయ్య ,శంకర్, మల్లేశ్,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
========================xx