బిజెపి కార్పొరేటర్లు…కొత్తకాపు అరుణ, ఆలే భాగ్యలక్ష్మి, శ్వేత, భాగ్యలక్ష్మి
సిరా న్యూస్,హైదరాబాద్;
సైదాబాద్ హనుమాన్ దేవాలయం నుంచి వెళ్లే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆపాలని జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కు బిజెపి కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు.
చంచల్గూడ నుంచి సంతోష్ నగర్ మార్గంలో జీహెచ్ఎంసి అధికారులు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. కానీ సైదాబాద్ హనుమాన్ దేవాలయం పై నుంచి స్టీల్ బ్రిడ్జి వెళ్లడంతో హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ మేరకు రం సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి, గౌలిపురా కార్పొరేటర్ అలె భాగ్యలక్ష్మి, ఐ ఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, ముసారాం బాగ్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డిలు గురువారం కమిషనర్ రోనాల్డ్ రోస్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ….స్టీల్ బ్రిడ్జి హనుమాన్ దేవాలయం పై వెళ్లడం అపచారమన్నారు. అత్యంత పురాతనమైన దేవలయమని శివుడు, గణనాథుడు, నవగ్రహాలు ఉన్నాయని…వాటి పై నుంచి ఫ్లై ఓవర్ వెళ్లడం మంచిది కాదన్నారు. జీహెచ్ఎంసి కమిషనర్ సానుకూలంగా స్పదించారని…ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడారని తెలిపారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల వివరాలు తెప్పించుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఒకవేళ దేవాలయం పై నుంచి వెళ్లే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆపకపోతే ప్రాణాలైన అర్పిస్తామని కార్పొరేటర్లు తెలిపారు.