ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఇలా ఉంటే ప్రమాదాలు జరగవా.

ఫుట్ పాత్ ఆక్రమించి వ్యాపారాలు.

సిరా న్యూస్,నంద్యాల;

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది.ఫుట్ పాత్ లను ఆక్రమించుకొని వ్యాపారాలు, నడి రోడ్డుపై టిఫిన్ సెంటర్ల బండ్లు వుండడంతో వాహనాలు,ప్రజలు వుండడంతో ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయం గా వుంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.గేటు ముందు ఆటోలు అడ్డంగా పెడుతూ పక్కకు జరుగు అన్నవారి పై దాడులు ,తిట్ల వర్షం కురిపిస్తున్నారు.ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మాత్రం కొద్ది రోజులు పోలీసులు హడావిడి చేస్తారు.ఆ ప్రాంతంలో ఏమి లేకుండా చర్యలు చేపడతారు. ప్రవేటు అంబులెన్సు లు యదావిధిగా ఫుట్ పాత్ ను ఆక్రమించుకున్నారు.ఆసుపత్రి ముందర అటు,ఇటు వ్యాపారాలు ఒకవైపు,చెత్తా,చెదారం తో వాసను వస్తున్నా అధికారుల్లో చలనం లేదు.ఇటీవల ఆసుపత్రి ముందు ట్రాఫిక్ సుడుగుండం లో ఒక సాఫ్ట్వేర్ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఆసుపత్రి వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తారని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *