బిట్టుపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలు

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామ శివారులోని పెద్ద చెరువు లో కేవలం నాలుగు రోజుల పర్మిషన్ తో అనుమతులు తీసుకుని వచ్చి చెరువు వద్ద ఎవరు అధికారులు లేకపోవడంతో మట్టి మాఫియా దొంగలు రాత్రి పగలు అని తేడా లేకుండా గత 15 రోజులుగా యంత్రాలతో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇటుక బట్టీలకు చెందిన కొంతమంది యజమానులు, రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. సుమారు 600 ఎకరాల పెద్ద చెరువులో గత 15 రోజులుగా
పదుల సంఖ్యలో జేసీబీ లు, వందల సంఖ్యలో లారీలతో ఓవర్ లోడ్ తో అక్రమంగా కరీంనగర్ జిల్లాలోని ఇటుక బట్టీలకు మట్టి రవాణా చేస్తున్నారు. ఇసుక, మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని గత నెలలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసిన మట్టి మాఫియా విచ్చలవిడిగా చెరువులో చొరబడి యంత్రాలు పెట్టి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నా మండలంలో, జిల్లా కేంద్రంలో అధికారులు ఎవరు పట్టించుకునే నాధుడే లేడు, జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున మట్టి మాఫియా గత 15 రోజులుగా మట్టి తీస్తున్న అధికారులు స్పందించడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *