కస్తూర్బా విద్యార్దినిలకు అస్వస్థత

సిరా న్యూస్,పరిగి;
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అమ్మయికి వాళ్ల ఆరోగ్యం రిత్య ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ ఇవ్వలని పూనుకుంది. అందులో భాగంగా జిల్లా వ్యప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్లో ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ ఇచ్చారు. మధ్యాహ్నం ఇచ్చిన ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ వేసుకున్న విద్యార్థులలో 30 మంది విద్యార్థీనిలకు అస్వస్థతకు గురైయ్యారు. వాందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనం సహాయంతో తరలించారు.ట్రీట్మెంట్ అనంతరం కొంత మంది చికిత్స తర్వాత విద్యార్థీనిలు కోలుకుంటున్నారు.ముగ్గురు విద్యర్థినీలకు ఆక్సిజన్ తో చికిత్స అందిస్తున్న వైద్యులు.ఇది మెడిసిన్ వేసుకోవడంవల్లా లేదా ఫుడ్ ఫైజన్ వల్లా అనే పనిలో పడ్డారు వైద్యులు. మెడిసిన్ మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి సమయంలో ఎందుకు అస్వస్థతకు గురవుతారు ఫుడ్ సరిగ్గా లేకే ఈవిధంగా జరిగిందంటున్నారు పిల్లలా తల్లిదండ్రులు. పిల్లలందరు ఆసుపత్రి పాలై ఇంత ఇబ్బందులు ఎదుర్కోంటుంన్నా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *