ప్రకృతి సేద్యంతో జీవన ప్రమాణాలు మెరుగు

సిరా న్యూస్,మైలవరం;
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచుకుందామని కలెక్టర్ సృజన అన్నారు. జి కొండూరు మండలంలోని చెవుటూరులో ప్రకృతి సేద్యం చేస్తున్న మహిళ రైతులతో ఆమె మాట్లాడారు. రైతులు పండించే పంటలపై ఆరా తీశారు. పంటలకు చీడపీడలు ఆశించకుండా ఎటువంటి కషా యాలు వాడుతున్నారో, ఎంత దిగుబడి వస్తుంది, పంటను ఎలా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు. భవిష్య త్తులో ప్రకృతి సేద్యం చేసే రైతులకు రాయితీపై ప్రోత్సాకాలను అందించి, పండిన పంటలను పాఠ శాలలకు మధ్యాహ్న భోజనంకు, వసతి గృహాలకు సప్లై చేసేలా ఫైలెట్ ప్రాజెక్టు ప్రారంభిద్దామని రైతు లకు హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించి, చిన్నారులకు అందించే పౌష్టికాహారం, పరిశుభ్రత పరిశీలించారు. జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం రుచి చూసి, పిల్లలకు ఆమె స్వయంగా వడ్డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *