చేసిన అభివృద్దే నన్ను గెలిపిస్తుంది

సిరా న్యూస్,పాణ్యం;
పాణ్యం నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని వైసీపీ అభ్యర్థి కాటసానిరాంభూపాల్ రెడ్డి అన్నారు.పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా కాటసానిరాంభూపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి వద్ద నుంచి కార్యకర్తలు,అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో నియోజవర్గం లో త్రాగు,సాగు నీటి అవసరాలు తీర్చడానికి కృషి
చేశానని,నన్ను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పాణ్యం నియోజకవర్గ ప్రజలకు రుణ పడి ఉంటానని,వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గా గెలవడం ఖాయమని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *