పట్టపగలే ఎలుగుబంట్లు హల్ చల్

సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, కరిగానపల్లి సమీపంలో పట్టపగలే ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తరచూ ఎలుగుబంట్లు పంట పొలాలకు వస్తున్న రైతులపై కూడా దాడి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం కుందుర్పిలోని ఒక బిస్కెట్ ప్యాక్టరి లోకి చొరబడ్డాయి. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *