అర్థరాత్రి… కాల్పుల కలకలం

 సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాదులో మరోసారి పోలీసు కాల్పుల కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంచేయడంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వ్యక్తికి గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు స్నాచింగ్ ముఠాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో దొంగలు కత్తులు, గొడ్డళ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్‌ దగ్గర చోటు చేసుకుంది. అయితే నిందితులను పట్టుకునేందుకు స్పెషల్‌ డికాయిటీ టీమ్‌ ప్రయత్నిచింది. పోలీసులపై దొంగలు ఎదురు దాడికి దిగడంతో గాల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *