జాతీయ నాయకుల విగ్రహాల ఆవిష్కరణ

 సిరా న్యూస్,నర్సీపట్నం;
నర్సీపట్నం మున్సిపాలిటీ పెద బొడ్డేపల్లి పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై 13 మంది జాతీయ నాయకుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది.ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన 70 శాతం పూర్తయిన రోడ్డు పనులు కూడా ప్రారంభించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి కొత్తవీధి మీదుగా పెద్ద బొడ్డేపల్లి సబ్ స్టేషన్ వరకు సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయుచున్న పనులు దాదాపు 70% పూర్తఅయ్యాయి. ఈరోజు రోడ్ ప్రారంభించి, టాంక్ బండ్ పై 13 మంది జాతీయ నాయకుల విగ్రహాలను ప్రతిష్టించారు. వివిధ కులాలు,ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, క్షత్రియ పరిషత్ పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా జాతీయ నాయకుల విగ్రహాలను ప్రారంభించారు. రోడ్డుకి ఇరువైపులా సుమారు 500 మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *