ఏపీలో పెరిగిన డ్రగ్స్ విక్రయాలు

సిరా న్యూస్,విశాఖపట్నం;
జగన్ పాలనలో నిరుద్యోగం మద్యం డ్రగ్స్ తాండవిస్తున్నాయి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గండి బాబ్జి అన్నారు.విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జరిగిన విలేఖరుల సమావేశంలో బాబ్జి మాట్లాడుతూ జగన్ పాలన లో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, గంజాయి, డ్రగ్స్ నిరుద్యోగం కూడ తాండవిస్తున్నాయి అని అన్నారు రాష్ట్రంలో దోపిడీలు నిత్యకృత్యం అయిపోయాయి.దోపిడీలపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసులు తో బెదిరిస్తున్నారు దాడులకు పాల్పడుతున్నారు. ఉద్యో గాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు జగన్ గ్రామ పంచాయి తీ వ్యవస్థను నాశనము చేశారు వలంటీర్ వ్యవస్థ ను పెట్టుకొని జగన్ పాలన చేస్తున్నారు.రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రానున్న ఎన్నికలలో జగన్ కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *