సిరా న్యూస్,శింగనమల;
నియోజకవర్గం లోని, నార్పలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక పై 45 ఏళ్ల వయసున్న ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. – నార్పలకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోనే జిరాక్స్ మిషన్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో బాలిక ఆధార్ కార్డు జిరాక్స్ కోసం నాగారాజు ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కామాంధుడు బాలిక కు మాయ మాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక భయంతో కేకలు వేస్తూ తప్పించుకుని బయటకు పరుగులు పెట్టింది. ఇంటికి చేరుకొని జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు కామాంధుడికి దేహశుద్ధి చేసారు. ఈ ఘటనపై పోలీసుల తక్షణ చర్యలలో భాగంగా…
నిందితుడిపై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్టుల కింద కేసు నమోదుచేసారు. రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, – ఇలాంటి ఘటనలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ లు పేర్కొన్నారు.