వైకాపా కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 సిరా న్యూస్,తాడేపల్లి;
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆవిష్కరించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ వై వి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు హజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *