సిరా న్యూస్,విశాఖపట్నం;
భారత్, అమెరికా మధ్య టైగర్ ట్రయంఫ్ – 2024 విన్యాసాలు తూర్పు తీరంలో ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక త్రివిధ దళాల సహాయం, పరస్పర స్నేహ సంబంధాలు మెరుగు పరుచుకునే క్రమంలో వీటిని చేపట్టిన ట్టు ఇరు దేశాల అధికారులు వెల్లడిం చారు. నావెల్ డాక్యార్డ్లోని ఐఎన్ ఎస్ జలాశ్వలో ప్రారంభమైన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా అమెరి కా తరుపున భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధా ర్కర్ పాల్గొన్నారు.రెండు శక్తివంతమైన దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాల ను ఇటువంటి ద్వైపాక్షిక విన్యాసాలు మరింత బలోపేతం చేస్తాయని ఎరిక్ గార్సెట్టి తెలిపారు. రోజురోజుకూ ఆర్థి క, రక్షణ రంగాల్లో భారత్ ఉన్నత స్థాయికి చేరుకుంటోందని చెప్పారు. మిలాన్కు కొనసాగింపుగా ఈ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు జరుగుతున్నట్టు రాజేష్ పెంధార్కర్ వెల్లడించారు. విశాఖ కేంద్రంగా ఈ నెల 25 వరకూ, సీ ఫేజ్కు సంబంధించి కాకినాడ తీరంలో ఈ నెల 26 నుంచి 31 వరకు ఈ విన్యా సాలు జరుగుతాయని తెలిపారు. తాజా విన్యాసాల్లో ఇండియన్ నేవీకి చెందిన నౌకలు జలాశ్వ, ఐరావత్, కేసరి, సహ్యాద్రిలతో పాటు ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్స్ వాహనాలు పాలుపంచుకున్నాయి. ఎయిర్ఫోర్స్ విమానాలు సి – 130 జె, హెలికాప్టర్లు ఎంఐ-17 పాల్గొన్ననున్నాయి