వివేకానంద విద్యా విహార్ హై స్కూల్
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
సిరా న్యూస్,పాములపాడు;
భారత దేశంలోని బాలిక విద్యను ప్రోత్సహించి నేటి వరకు ఎంతో మంది విద్యావంతులుగా మారి ప్రభుత్వ అధికారులు సామాజికవేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయ ప్రముఖులైన మహిళలు సావిత్రిబాయి పూలే స్థాపించిన విద్యాలయాలే నాంది అని శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రాయపాటి దేవిక అన్నారు, మండల కేంద్రమైన పాములపాలని వివేకానంద ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె బాలిక విద్య కోసం చేసిన త్యాగాలను విద్యార్థులకు వివరించారు. సామాజిక వేత్త,, సంఘసంస్కర్త ఉద్యమకారుడు అయిన మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణిగా కృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమన్నారు దేశాభివృద్ధి సమావేశాభివృద్ధి జరగాలంటే బాలిక విద్య ఆవశ్యకత ఎంతైనా ఉందని భారతదేశంలోని మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు సావిత్రిబాయి పూలే.. ఎన్నో అవమానాలకు ఒడిదుడుకుల ను ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల తో పాటు అన్ని సామాజిక వర్గాల బాలికలను చదువు వైపు దృష్టి సారించేలా అదిరాల కృషి చేసిన సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు,, భారతీయ తొలి ఉపాధ్యాయులుగా చరిత్రపుటల్లో ఉండిపోయారన్నారు, 1848లో ప్రారంభించిన బాలిక పాఠశాలను బాలిక విద్యాలయాలను స్థాపించడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారన్నారు, కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ మాట్లాడుతూ బాలిక విద్యను ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించేలా ప్రజల్లో చేతనం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.. ప్రధానంగా విద్యార్థులు సావిత్రిబాయి పూలే ఆశయాల వైపు పైనించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేంద్ర షాజహాన్ అన్వర్ భాష నారాయణాచారి, హబీబుల్లా, స్రవంతి హిమప్రియ,హసీనా హరిత, స్రవంతి , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు